ఏమిరా.. బరువు పెరిగిపోతున్నావు.. కాస్త అన్నం తగ్గించరా అని పెద్దవాళ్లు మించిన బరువుతో కష్టంగా నడుస్తున్నవారిని చూసి అంటుంటారు. అన్నం తింటే బరువు పెరిగిపోతారని అందరూ అంటుంటారు. అయితే ఈ హెడ్డింగ్లో రైస్ డ్రింక్ తాగితే బరువు తగ్గడం ఏమిటా ..? అని ఆలోచిస్తున్నారా.. ? ఇది చదవడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా.. ఖచ్చితంగా బరువు తగ్గించేందుకు రైస్ డ్రింక్ తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు అదనపు కొవ్వు బరువు పెరిగేందుకు కారణం అవుతుండగా.. దానిని తగ్గించుకునేందుకు అనేక మార్గాల్లో చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
ఇలా డైటింగ్ చేసే క్రమంలోబరువు తగ్గే వరకైనా అన్నం తినడం తగ్గించాలని సూచిస్తుంటారు. కాని అన్నం లేకుండా ఉండలేమని ఆందోళన చెందుతుండడాన్ని చూస్తూనే ఉంటాం. అటువంటి వారికి కింద చెప్పిన రై్స్ డ్రింక్ ఓ వరం వంటిది. ఈ డ్రింక్ తాగితే అన్నం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొవ్వు కరుగుతుంది. ఇది పూర్తిగా ఇంట్లోనే తయారు చేసుకోగల డ్రింక్. రైస్ డ్రింక్ను తయారు చేసుకోవడం ఎలాగో మనం కూడా చూద్దాం..
రైస్ డ్రింక్కు కావాలసిన పదార్థాలు :
1. బియ్యం – రెండు టేబుల్ స్పూన్లు
2. నీరు – తగినంత
3. ఎండిన అల్లం పొడి – తగినంత
4. మిరియాల పొడి – తగినంత
5. జీలకర్ర – తగినంత
తయారు చేసే విధానం ఇలా…
అల్లంపొడి, జీలకర్ర, మిరియాల పొడిలను సమాన భాగాల్లో తీసుకుని వాటిని మల్లీ మిక్సీ పట్టి పొడిగా చేయాలి. ఈ పొడి నుంచి 1/4 టీ స్పూన్ పొడిని తీసుకుని దాన్ని బియ్యానికి కలిపి ఈ మిశ్రమాన్ని మళ్లీ ఒక గ్లాస్ నీటికి కలపాలి. ఒక పాత్రలో ఈ మిక్స్ను వేసి డికాషన్లా మరిగించాలి. అనంతరం ఆ ద్రవాన్ని వడకట్టి దానికి కొద్దిగా ఉప్పును కలిపి తీసుకోవాలి. బరువు తగ్గేందుకు అనేక రకాలుగా ప్రయత్నించేవారు.. దీన్ని తాగితే శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే కరిగించేస్తుంది. అంతే కాకుండా కొంత కొద్ది డ్రింక్తోనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అధిక బరువు తగ్గించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.